పీఎస్ టాయిలెట్‌లో వ్యక్తి ఆత్మహత్య | A man committed suicide in police station toilet | Sakshi
Sakshi News home page

పీఎస్ టాయిలెట్‌లో వ్యక్తి ఆత్మహత్య

Aug 2 2017 6:28 PM | Updated on Aug 28 2018 5:25 PM

ఓ కేసు విషయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి టాయిలెట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: ఓ కేసు విషయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి టాయిలెట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేశ రాజధానిలో బుధవారం వెలుగుచూసింది. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి పోలీస్‌స్టేషన్‌ మరుగుదొడ్లో రాజ్‌కుమార్‌(32) అనే వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్‌ ఓ కేసు విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఏమైంతో తెలియదు, అనూహ్యంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్‌రామ్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement