ఏకే 47తో విజయోత్సవాలు! | 47 AK-10 with a victory! | Sakshi
Sakshi News home page

ఏకే 47తో విజయోత్సవాలు!

Dec 27 2014 3:37 AM | Updated on Jun 4 2019 6:41 PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్‌సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్..

 శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్‌సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్‌తో గాలిలో పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, తాను కాల్పులు జరపలేదని, తన భద్రతాధికారి తుపాకీ కిందపడితే.. తీసిచ్చానని మిర్ వివరణ ఇచ్చారు. కాగా, ‘ఏకే 47తో కాల్పులు జరిపిన మిర్‌పై పోలీసులు కేసు పెట్టే ధైర్యం చేయగలరా?’ అని ఒమర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement