మందుపాతర పేలుడు: జవాన్లకు గాయాలు | 2 jawans injured in landmine blast | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలుడు: జవాన్లకు గాయాలు

May 19 2017 12:33 PM | Updated on Sep 5 2017 11:31 AM

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి కూంబింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఛత్తీస్‌ఘడ్‌: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి కూంబింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఛత్తీస్‌ఘడ్‌ సుక్కమాజిల్లా ధోర్నపాల్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం వెలుగుచూసింది. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ బాంబ్‌ పేలింది. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని జగదల్పూర్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement