11 ఏళ్ల బాలికపై అత్యాచారం | 11-Year-Old Gang-Raped As Mother And Brother Were Held At Gunpoint | Sakshi
Sakshi News home page

11 ఏళ్ల బాలికపై అత్యాచారం

Sep 4 2017 12:45 PM | Updated on Oct 8 2018 3:17 PM

11 ఏళ్ల బాలికపై అత్యాచారం - Sakshi

11 ఏళ్ల బాలికపై అత్యాచారం

ఓ 11 ఏళ్ల బాలికపై ఆమె తల్లి, అన్న ముందే దుండగులు అత్యాచారం జరిపారు.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ 11 ఏళ్ల బాలికపై ఆమె తల్లి, అన్న ముందే దుండగులు అత్యాచారం జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత బుధవారం బాలిక ఆమె తల్లి, టీనేజ్‌ అన్నయ్యతో నిద్రిస్తుండగా రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆ బాలికపై అత్యాచారం జరిపారు. ఇద్దరు గన్‌తో బాలిక తల్లి, అన్నను బెదిరించగా మూడోవాడు అత్యాచారం జరిపాడు. అనంతరం బాలిక తల్లి, అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అత్యాచారం జరిపింది జాన్వర్‌ సింగ్‌ (36) గా, సహాకరించింది రాజు కుశ్వహా(25) , రామ్‌నీవాస్‌(24) పోలీసులు గుర్తించారు.  ఈ ముగ్గుర్ని గత రాత్రి అదుపులోకి తీసుకున్నామని, పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గ్వాలియర్‌ బిజోలి పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతొందని, బాలికను వైద్యపరీక్షలకు పంపించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement