సైమా అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన ‘వాట్‌ ఏ అమ్మాయి’

What A Ammayi Short Film Nominated Siima Short Film Awards - Sakshi

టాలీవుడ్‌లో లీడింగ్‌ పీఆర్వోగా కొనసాగుతున్న ఏలూరు శ్రీను దర్శకుడిగా మారి లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. మా కాలని ఫిగర్‌, వాట్‌ ఏ అమ్మాయి అనే టైటిల్స్‌తో రూపొందిన లఘు చిత్రాలు మంచి విజయం సాధించటమే కాదు అవార్డులు రివార్డులను కూడా తెచ్చిపెట్టాయి. తొలి షార్ట్‌ ఫిలింకు ఓ ప్రముఖ చానల్‌ నిర్వహించిన కాంపిటీషన్‌లో ఉత్తమ నటి అవార్డు దక్కగా, తాజాగా వాట్‌ ఏ అమ్మాయి ఏకంగా సైమా అవార్డ్స్‌ బరిలో నిలిచింది. ఈ షార్ట్‌ ఫిలింకు సంగీతం అందించిన నరేష్ పెంట ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరిలో నామినేట్‌ అయ్యాడు.

మెగా అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏలూరు శ్రీను తరువాత పీఆర్వోగా కొనసాగుతూనే బస్టాప్‌, లవర్స్‌, రోజులు మారాయి, ఒక్క క్షణం, కొత్త జంట, చిత్రం  భళారే విచిత్రం, కొబ్బరి మట్ట చిత్రాల్లో నటించాడు. దర్శకత్వంపై మక్కువతో లఘు చిత్రాలను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఏలూరు శ్రీను పలువురు స్టార్ హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top