‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

Telugu Movie F2 Select To Screen At Indian Panorama 2019 In Goa - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ప్రస్ట్రేషన్‌)’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ నిర్మించారు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాల నుంచే కామెడీ జనరేట్‌ చేసిన అనిల్‌.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేలా చేశాడు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. 

‘ఇండియన్‌ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 50వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్సవాలు నవంబర్‌లో గోవాలో జరగనున్నాయి. ఈ ఫెస్టివల్‌లో ఎఫ్‌2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఎఫ్‌2 చిత్రం ఐఎఫ్‌ఎఫ్‌ఐ-2019 ప్రదర్శనకు ఎంపిక కావడంపై దిల్‌ రాజ్‌, అనిల్‌ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా, వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, ప్రకాశ్‌రాజ్‌, ప్రియదర్శి, రఘుబాబు ఇతర ప్రధాన పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top