తాతామనవళ్ల 'శతమానం భవతి' | 'Sathamanam bhavathi' motion poster released | Sakshi
Sakshi News home page

తాతామనవళ్ల 'శతమానం భవతి'

Aug 14 2016 7:05 PM | Updated on Sep 4 2017 9:17 AM

తాతామనవళ్ల 'శతమానం భవతి'

తాతామనవళ్ల 'శతమానం భవతి'

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, 'అ..ఆ' ఫేమ్ అనుపమా పరమేశ్వరన్లు జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శతమానంభవతి'.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, 'అ..ఆ' ఫేమ్ అనుపమా పరమేశ్వరన్లు జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శతమానంభవతి'. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2006లో 'బొమ్మరిల్లు' సినిమాలో తండ్రీ,కొడుకులను దగ్గర చేశామని, సరిగ్గా పదేళ్ల తర్వాత 2016లో ఈ సినిమాలో తాతా,మనవళ్లను దగ్గర చేయబోతున్నామంటూ ఆ పోస్టర్ ద్వారా సినిమా థీమ్ను తెలిపారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement