ప్రకృతే సాక్ష్యం

Saakshyam Audio Launch on July 7th - Sakshi

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించారు. జగపతిబాబు, శరత్‌ కుమార్, మీనా, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్‌ కీలక పాత్రలు చేశారు. హర్షవర్ధన్‌ రామేశ్వరన్‌ స్వర పరచిన ఈ సినిమా ఆడియోను జూలై 7న విడుదల చేయనున్నారు.

‘‘ప్రకృతే సాక్ష్యంగా ఈ సినిమాను రూపొందించాం. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆర్తు ఏ.విల్సన్‌ అందించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు ప్రధాన బలం. ‘బాహుబలి’ చిత్రానికి సీజీ వర్క్‌ చేసిన టీమ్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. టైమ్‌ మ్యూజిక్‌ సౌత్‌ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. జూలై 20న ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top