‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా! | Rajendra Prasad sworn in MAA President | Sakshi
Sakshi News home page

‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా!

Apr 19 2015 11:29 PM | Updated on Sep 3 2017 12:32 AM

‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా!

‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా!

ప్రతినెలా 50 మంది పేద కళాకారులకు పింఛన్లు అందిస్తామని ‘మా’ నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

ప్రతినెలా 50 మంది పేద కళాకారులకు పింఛన్లు అందిస్తామని ‘మా’ నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం ఫిలిం చాంబర్‌లో జరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్, తదితర సభ్యులతో ‘మా’ పూర్వ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాను. ‘మా’లో నూతన ఒరవడిని సృష్టిస్తా. ఇప్పటినుంచి ‘మా’ అధ్యక్షుడిగా కొత్త పాత్రలో లీనమవుతా. ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తా’’ అని చెప్పారు. తన గెలుపు వెనుక మెగా ఫ్యామిలీ ఉందని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement