ఇటలీ ఇక్కడే!

Prabhas New Telugu Movie Shooting Schedule Plans At Hyderabad - Sakshi

ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జార్జియా షెడ్యూల్‌ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. యూరప్‌ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ షూటింగ్‌ కొంత భాగం ఇటలీలో జరగాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటలీలో చిత్రీకరించారు. 

కానీ ఇటలీలో ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. పైగా కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా ఆయా ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ తర్వాత ఇటలీ షెడ్యూల్‌ కొనసాగించాలన్నా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సరిగ్గా సమకూరుతాయా? లేదా అనే సందేహం చిత్రబృందంలో ఉందట. అందుకని ఇటలీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరపాలనుకుంటున్నారట. ఈ సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ ఇటలీ లొకేషన్స్‌కు సంబంధించిన డిజైన్స్, సెట్‌ వర్క్‌ వంటివాటిపై ఇప్పటికే దృష్టి సారించారని తెలిసింది. లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌లోనే ఇటలీ సెట్‌ వేసి, చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top