నాలుగు రోజుల్లో రూ. 136 కోట్లు! | pk mints rs. 136 crores in four days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో రూ. 136 కోట్లు!

Dec 24 2014 5:43 PM | Updated on Apr 3 2019 6:23 PM

నాలుగు రోజుల్లో రూ. 136 కోట్లు! - Sakshi

నాలుగు రోజుల్లో రూ. 136 కోట్లు!

రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పీకే'ను ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు.

రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పీకే'ను ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. విడుదలైన నాలుగు రోజులకే ఈ సినిమా రూ. 136 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ బాక్సాఫీసు లెక్కలు చూసే నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కేవలం భారతదేశంలోనే. ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు.

(పీకే సినిమాపై మరో ఎఫ్ఐఆర్)
ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసి హీరోయిన్ అనుష్కాశర్మ పొంగిపోతోంది. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి కళ్ల వెంబడి నీళ్లు ఆగడంలేదని ట్విట్టర్ ద్వారా చెప్పింది. హృదయపూర్వకంగా తాను అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు అందులో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement