త్వరలో సెట్స్‌ మీదకు ‘కార్తికేయ 2’

Nikhil And Chandoo Mondeti People Media Factory Film Karthikeya 2 - Sakshi

2014 లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ  2’ రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది.

నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ  2’  పేరుతో రూపొందనున్న ఈ సినిమాను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు (జూన్ 1) సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ‘నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం కార్తికేయ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్‌లో రూపొందనున్న కార్తికేయ 2 చిత్రం పై అంచనాలు అధికంగానే ఉంటాయన్న ది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. కార్తికేయకు కొనసాగింపుగా కార్తికేయ 2  ఉంటూనే కథా ,కథనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈచిత్రం’ అన్నారు.

కార్తికేయ  2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ, నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు. తమ కథానాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top