త్వరలో సెట్స్‌ మీదకు ‘కార్తికేయ 2’ | Nikhil And Chandoo Mondeti People Media Factory Film Karthikeya 2 | Sakshi
Sakshi News home page

త్వరలో సెట్స్‌ మీదకు ‘కార్తికేయ 2’

May 31 2019 3:41 PM | Updated on May 31 2019 3:41 PM

Nikhil And Chandoo Mondeti People Media Factory Film Karthikeya 2 - Sakshi

2014 లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ  2’ రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది.

నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ  2’  పేరుతో రూపొందనున్న ఈ సినిమాను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు (జూన్ 1) సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ‘నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం కార్తికేయ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్‌లో రూపొందనున్న కార్తికేయ 2 చిత్రం పై అంచనాలు అధికంగానే ఉంటాయన్న ది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. కార్తికేయకు కొనసాగింపుగా కార్తికేయ 2  ఉంటూనే కథా ,కథనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈచిత్రం’ అన్నారు.

కార్తికేయ  2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ, నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు. తమ కథానాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement