ముంబై: అలనాటి మరాఠీ సినీ నటి నయనతార(64) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె ఠాణలో నివాసముంటున్నారు. కొంత కాలంగా మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం ఆస్వస్థతకు గురికావడంతో ఆమెను ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించిన నయనతార 'బాళా గావు కషి అంగాయి', 'అశి హీ బన్వా బన్వీ', 'ధాంగడ్ధింగా' తదితర ప్రముఖ మరాఠీ చిత్రాలలో ఆమె నటించారు.
**
Related news
-
కేవలం రూ.5 కోట్ల బడ్జెట్.. బాక్సాఫీస్ బ్లాక్బస్టర్.. ఆర్నెళ్ల తర్వాత ఓటీటీకి!
Baipan Bhari Deva on OTT: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. చిన్న సినిమాలు సైతం ఓటీటీల్లో అదరగొట్టేస్తున్నాయి. థియేటర్స్లో పెద్దగా ఆదరణ లభించని చిత్రాలకు సైతం.. ఓటీటీకి వచ్చేసరికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం.. థియేట్రికల్ రిలీజ్లోనే హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ బైపన్ భారీ దేవ మూవీ దాదాపు రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీ భాషలో తెరకెక్కిన బైపన్ భారీ దేవ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఒకటి కాదు.. ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది జూన్ 30న విడుదలైన ఈ సినిమా.. తాజాగా ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. మరొకటి హులు యాప్లో అందుబాటులో ఉంది. హాట్ స్టార్లో మరాఠీతోపాటు హిందీ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం సబ్ టైటిల్స్లో మాత్రమే చూసే వెసులుబాటు ఉంది. ఈ సినిమాను ప్రస్తుతం హిందీ, మరాఠీ భాషల్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం మరో ఓటీటీ హులు యాప్లో కేవలం అమెరికాలో మాత్రమే ఉంది. అక్కడ ఉన్న వారికి మాత్రమే బైపన్ భారీ దేవ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. కాగా.. బైపన్ భారీ దేవ అంటే స్త్రీతత్వం కఠినమైనది అనే అర్థం వస్తుంది. ఈ చిత్రంలో రోహిణి హట్టంగడి, వందనా గుప్తే, సుకన్య కులకర్ణి, శిల్పా నవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపా పరాబ్ ప్రధాన పాత్రలు పోషించారు. బైపన్ భారీ దేవ చిత్రానికి కేదార్ షిండే దర్శకత్వం వహించారు. అలాగే జీ స్టూడియోస్, ఎమ్వీబీ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ఆరుగురు అక్కాచెల్లెళ్లకు సంబంధించిన విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించారు. -
సింగర్ను పెళ్లాడనున్న బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
మరాఠీ నటి స్వానంది టికేకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఇండియన్ ఐడల్- 12 కంటెస్టెంట్ ఆశిష్ కులకర్ణితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్వానంది తన ఇన్స్టాలో రాస్తూ..' మేము నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక నుంచి నువ్వే నా ఏకైక ఇల్లు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా.. స్వానంది ప్రముఖ నటుడు ఉదయ్ టికేకర్, ప్రసిద్ధ సింగర్ ఆరతి అంకాలికర్ కుమార్తె. సింగర్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత స్వానంది తన పెళ్లి గురించి మాట్లాడింది. (ఇది చదవండి: ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్ నటుడు!) స్వానంది మాట్లాడుతూ..' మా పెళ్లి త్వరలోనే జరగబోతోంది. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రస్తుతానికి ఇది మాత్రమే చెప్పగలను. నేను జీవితంలో ఒక నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా. ఆశిష్, నేను మా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆస్వాదిస్తున్నా.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఇండియన్ ఐడల్ -12 తర్వాత ఆశిశ్కు గుర్తింపు వచ్చింది. కాగా.. స్వానంది టికేకర్ మరాఠీ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. దిల్ దోస్తీ దునియాదారి, దిల్ దోస్తీ దొబారా, అస్సా మహేర్ నాకో గా బాయి పాత్రలకు ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా ఏక్ శూన్య తీన్, డోంట్ వర్రీ బి హ్యాపీ అనే చిత్రాల్లో నటించింది. ఇండియన్ ఐడల్ మరాఠీ షోకు హోస్ట్గా చేసింది. View this post on Instagram A post shared by A D I N A T H P A ‘त’ K A R (@adinath.patkar) (ఇది చదవండి: 'ఓపెన్హైమర్' సినిమాలో ఆ సీన్ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ) View this post on Instagram A post shared by Ashish Kulkarni (@ashishkulkarni.music) -
ఈ 'శూర్పణఖ' కథ కూడా కన్నీటి మయం
ప్రభాస్తో ఔెం రౌత్ తెరక్కించిన 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణడి పాత్రలన్ని కూడా పాపులర్ అయిన నటులే పోషించారు. కానీ రామ-రావణ యుద్ధానికి కారణమైన రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటించిన తేజస్విని పండిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. (ఇదీ చదవండి: Niharika Reaction: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) ఆమె చేసింది రాక్షసి పాత్రే అయినా.. అందాల రాక్షసిగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 2004లో ఎంట్రీ ఇచ్చి మరాఠిలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి ప్రస్థుతం అక్కడ పెద్దగా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. పలు సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లోనూ ఆకట్టుకుంది. పలు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కానీ టాలెంట్ ఉన్నా కూడా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి ఈ పేరు పెట్టాం: కాజల్) అయితే తేజస్విని పండిట్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే తన చిన్ననాటి స్నేహితుడైనా భూషణ్ బోప్చేను 2012లో వివాహం చేసుకుంది. వారి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా అమె కుటుంబ విషయాల గురించి తెలుపుతూ.. ఒకానొక సమయంలో తినడానికి కూడా తిండి లేదని ఎమోషనల్ అయింది. తన ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు... కానీ అప్పులు మాత్రం ఇంటి నిండా ఉండేవి అని తెలిపింది. ఇప్పుడు ఆ జీవితాన్ని తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని పేర్కొంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే తేజస్విని పండిట్.. తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది. అక్కడ తనకు ఓక మిలియన్కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Tejaswwini (@tejaswini_pandit) -
నటి నగ్న ఫోటోలు.. ఫ్రెండ్ చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్తో నిండిన ప్రపంచం. అవకాశాలు రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ కూడా అలానే ఉంటోంది. కాస్త గ్లామర్ ఒలకబోస్తేనే చూసేవారు కష్టమైపోయారు. అలాంటి ఈ ఫీల్డ్లో నగ్న ఫోటో షూట్లకు సైతం నటీమణులు వెనుకకాడడం లేదు. అలానే గతంలో ఓ సంఘటనను గుర్తు చేసుకున్న ఓ నటి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె ఫ్రెండ్ చేసిన పనికి ఎమోషనలైంది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్లో షాహిద్ కపూర్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో పని మనిషిగా నటించిన మరాఠీ నటి వనితా ఖరత్. ఆమె చేసిన నగ్న ఫోటోషూట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె చేసిన పనికి పలువురు విమర్శించారు కూడా. అయితే తనకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయని ఆమె వెల్లడించింది. ఇదే ఫోటోలను చూసిన ఆమె ఫ్రెండ్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. ఆమె ఫోటోలను తన గదిలో గోడకు తగిలించుకుంటానని అడిగాడట. ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయినట్లు వెల్లడించింది. నగ్న ఫోటో షూట్ కోసం ఎలాంటి స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అంటే ఇష్టమని.. ఆయనతో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు మనసులో మాట బయటపెట్టింది. View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) -
రెంట్ ఇవ్వడానికి వెళ్తే.. రేట్ ఎంత అన్నాడు: ప్రముఖ నటి
ప్రముఖ సినీ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మరాఠి హీరోయిన్ తేజస్విని పండిట్ వేధింపులకు గురైన విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తేజస్విని నటి జ్యోతి చందేకర్ కుమార్తె. హౌస్ రెంట్ ఇవ్వడానికి కార్పొరేటర్ ఇంటికి వెళ్తే.. తనతో గడిపేందుకు డైరెక్ట్గా రమ్మని పిలిచాడని తేజస్విని తెలిపింది. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తాను వెంటనే అపార్ట్మెంట్ ఖాళీ చేసి వచ్చానని పేర్కొంది. తేజస్విని మాట్లాడుతూ.. '2009-10 ప్రాంతంలో నేను సింహగడ్ రోడ్లో (పుణెలో) అద్దె అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. అపార్ట్మెంట్ ఓ కార్పొరేటర్కు చెందినది. నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్లా. అతను నాకు నేరుగా ఆఫర్ ఇచ్చాడు. అక్కడే టేబుల్ మీద ఒక గ్లాసు నీరు ఉంది. నేను వెంటనే తీసుకుని అతని ముఖం మీద విసిరా. నేను అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి ప్రవేశించలేదు. నా వృత్తి కారణంగా, నా ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నందున ఇలా ప్రవర్తించారు. ఈ సంఘటన నాకు ఓ అనుభవం లాంటిది' అని అన్నారు. కాగా.. 2004లో కేదార్ షిండే అగా బాయి అరేచాతో తేజస్విని సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది.
Related News by category
-
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
కుతుబ్ మినార్పై కొత్త థీమ్ - వీడియో
ఢిల్లీ: ఏడు దశల లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న (మొదటి దశ) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలకు ఓటు హక్కు మీద అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఓ వినూత్న పద్దతిని ఎంచుకుంది.కుతుబ్ మినార్ మీద త్రివర్ణ పతాకంతో పాటు.. మిరమిట్లు గొలిపే ఎన్నికల సంఘం లోగో కనిపించింది. ఎన్నికల నేపధ్యానికి సంబంధించిన లైట్లు, పోస్టర్లు, విజువల్స్ అన్నీ కుతుబ్ మినార్ మీద ఆకర్షణీయంగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) పేజీలో పోస్ట్ చేసింది.ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మే 3న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.Let's celebrate this festivity by casting our votes #GeneralElections2024📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT— Election Commission of India (@ECISVEEP) April 27, 2024 -
జైల్లో కుదుటగానే కేజ్రీవాల్ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది. టైప్-2 డయాబేటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తోంది. ఈ మేరకు ఎయిమ్స్కు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. కేజ్రీవాల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నందున, ఆయన ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించిం.ది మెడిసిన్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని తెలిపింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.కాగా ఆయన షుగర్ లెవల్స్ 320కు పెరగడంతో గతవారం తీహార్ జైల్లో తొలి ఇన్సులిన్ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే స్వీట్స్, మామిడిపండ్లు, ఆలూపూరీ వంటి ఆహార పదార్దాలు తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.అయితే టైప్ 2 డయాబెటిక్ పేషెండ్ అయిన కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది ఖచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్కు కట్టుబడి ఉండాలని పేర్కొంది.
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement