జననం

jananam movie launch in hyderabad - Sakshi

అనిల్, భవ్యశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జననం’. శ్రీనివాస్‌ మల్లం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘మాగ్నెట్‌’ మూవీ డైరెక్టర్‌ ఆదిశేష సాయిరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మరో దర్శకుడు లారెన్స్‌ క్లాప్‌ ఇచ్చారు. శ్రీనివాస్‌ మల్లం మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘డైరెక్టర్‌ శ్రీనివాస్‌తో గత మూడేళ్లుగా నాకు పరిచయం ఉంది. మంచి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నేను హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు అనిల్‌. భవ్యశ్రీ, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top