
అప్పట్లో నాన్నగారు చేయాలనుకున్న కథ ఇది!
నా వందో సినిమా కోసం ఎన్నో కథలు విన్నా. ఇంకా ఏదో కావాలనిపించేది. ఆ క్రమంలోనే క్రిష్ చెప్పిన కథ విన్నా...
- బాలకృష్ణ
‘‘నా వందో సినిమా కోసం ఎన్నో కథలు విన్నా. ఇంకా ఏదో కావాలనిపించేది. ఆ క్రమంలోనే క్రిష్ చెప్పిన కథ విన్నా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్క్రిప్ట్ విన్నాక ఇంత కాలం దీనికోసమే ఆగానేమో అనిపించింది. ఎందుకంటే ఇది తెలుగు వీరుడి కథ’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తీసే క్రిష్ ఇటీవల ‘కంచె’కు జాతీయ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ వందో సినిమాకు ఆయన ఓ శక్తిమంతమైన కథంశాన్ని ఎంచుకు న్నారు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది పర్వదినాన ఆంధ్ర రాజధాని అమరావతిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘వాస్తవానికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా మా నాన్నగారు స్వర్గీయ ఎన్టీయార్ చేద్దామనుకున్నారు. కొన్నాళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. కానీ, ఎందుకనో ఆ సినిమా ఆగి పోయింది. ఆ విషయం నాకూ ఈ మధ్యనే తెలిసింది. క్రిష్కూ, నాకూ నాన్నగారే సంధానకర్తగా వ్యవహరించారేమోనని అనిపిస్తోంది.
ఇది మన తెలుగువాడి ఘన చరిత్ర. మనం అశోకుడు, అక్బర్ లాంటి చక్రవర్తుల గురించి మాట్లాడుకుంటాం. ఛత్రపతి శివాజీని లాలించేట ప్పుడు ఆయన తల్లి కూడా గౌతమీపుత్ర శాతకర్ణి గురించి కథలు కథలుగా చెప్పేవారట. తెలుగు భాష, సంస్కృతి ఉన్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి. కానీ, మన తెలుగువాడైన ఆయనకు అనుకు న్నంత గుర్తింపు దక్కలేదని నా అభిప్రాయం. ఇదే అమరావతి రాజ ధానిగా భరతఖండాన్ని పాలించాడు. శాంతి కోసం యుద్ధం చేసిన మహా వీరుడాయన.
నేను చేసిన 99 సినిమాల ఫలితమే ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని నా నమ్మకం. ఇది దైవ నిర్ణయం. యావత్ భారతదేశమే కాక ప్రపంచం మొత్తం గర్వపడేలా ఈ సినిమా చేస్తాం’’ అన్నారు. ‘‘ముక్కలు ముక్కలుగా ఉన్న భారతాన్ని ఒక్కటి చేసి పాలించిన శాతకర్ణి జీవితం ఆధారంగా, ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్తో ఈ సినిమా తీస్తున్నందుకు సంతో షంగా ఉంది. ఈ ఛాన్సిచ్చిన బాలకృష్ణగారికి కృత జ్ఞతలు’’ అని క్రిష్ చెప్పారు.