కంటతడి పెట్టుకున్న బోనీ కపూర్‌! | Boney Kapoor Was Become Emotional At IIFA Awards | Sakshi
Sakshi News home page

Jun 25 2018 9:49 PM | Updated on Jun 25 2018 9:55 PM

Boney Kapoor Was Become Emotional At IIFA Awards - Sakshi

శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్‌ పలు సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. జాతీయ చలన చిత్ర అవార్డు వేడుకల్లో బోనీ కపూర్‌ శ్రీదేవి తరుపున అవార్డు తీసుకుంటూ.. ఎమోషనల్‌ అయ్యారు. తాజాగా ఐఫా వేడుకల్లో బోనీ కపూర్‌ స్టేజ్‌పైనే కన్నీటిపర్యంతమయ్యారు. 

శ్రీదేవి గతేడాది నటించిన మామ్‌ చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డును శ్రీదేవి తరుపున బోనీ కపూర్‌ అందుకుంటూ భావోద్వేగానికి లోనవుతూ.. ‘నిన్ను ప్రతీక్షణం మిస్సవుతున్నాను’ అంటూ కళ్లు చెమర్చగా... అర్జున్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌లు వచ్చి బోనీ కపూర్‌ను ఓదార్చుతూ..  ప్రపంచం, భారతదేశం..మా కుటుంబాలు శ్రీదేవీని ఎప్పటికీ మరిచిపోలేమని అనిల్‌ కపూర్‌ అన్నారు. దుబాయ్‌లో పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి ప్రమాదావశాత్తు బాత్‌రూం టబ్‌లో పడి  ఫిబ్రవరి 24న మరణించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement