అవతారం | 'Avatharam' is getting ready to hit the screens in February | Sakshi
Sakshi News home page

అవతారం

Jan 27 2014 11:26 PM | Updated on Sep 2 2017 3:04 AM

అవతారం

అవతారం

సైన్స్‌లో జరిగే పరిణామాల కారణంగా ఒక గ్రహం భూమికి చేరువగా జరిగితే ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవతారం’.

 సైన్స్‌లో జరిగే పరిణామాల కారణంగా ఒక గ్రహం భూమికి చేరువగా జరిగితే ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవతారం’. ఎం. కవిత సమర్పణలో అరుంధతి ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఎం. యుగంధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి, భానుప్రియ, రిషి ముఖ్య తారలు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సరికొత్త కథను కొత్త కోణంలో కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అమ్మోరు, అరుంధతి సాంకేతికంగా అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం టెక్నికల్‌గా మరో మెట్టు పైనే ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి అనుకున్న బడ్జెట్‌కన్నా ఎక్కువైంది. సినిమా నిర్మాణానికి కూడా ఎక్కువ సమయం పట్టింది. ఆలస్యం అయినా సినిమా అద్భుతంగా రావడంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కోడి రామకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement