టాలీవుడ్‌పై ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారు.. | Andhra Pradesh People Angry On Tollywood For Special Status Issue | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌పై ఏపీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు..

May 10 2018 5:38 PM | Updated on Aug 28 2018 4:32 PM

Andhra Pradesh People Angry On Tollywood For Special Status Issue - Sakshi

సాక్షి, విజయవాడ : తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారని  నిర్మాత యలమంచిలి రవిచంద్‌ అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం అడిగినా... అడగకపోయినా సినీ పరిశ్రమ వెంటనే స్పందిస్తుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టికెట్స్ రూపంలో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తున్నారని, అటువంటి ఆంద్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఉద్యమంపై ఎందుకు  చిన్న చూపు చూస్తున్నారని రవిచంద్‌ ప్రశ్నించారు.

సినీ పరిశ్రమలో ఉన్నవారు ప్రత్యేక హోదా కోసం 48 గంటల్లో స్పందించి పోరాటం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని రవిచంద్‌ అన్నారు. కాగా రవిచంద్‌ గతంలో పైరసీకి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్మాతగా ఛార్మి, వేణులతో మాయగాడు, సీతారాముడు చిత్రాలను రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement