
నాన్నకు ప్రేమతో...
మాజీ విశ్వసుందరి, ప్రసిద్ధ సినీ తార ఐశ్వర్య రాయ్ శనివారం మంగళూరు సమీపంలో ఉన్న పుత్తూరుకు వచ్చారు.
అంతకు ముందు వారు ఉప్పినగుండి సమీపంలో ఉన్న సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ ఎక్కడా కనిపించలేదు. ఐశ్వర్య కుటుంబం స్వస్థలం మంగళూరు అన్నది తెలిసిందే. తండ్రి జ్ఞాపకాలతో ఐశ్వర్య ఆద్యంతం దిగులుగా కనిపించింది. నటీమణి రాక సందర్భంగా ఎయిర్పోర్టు, ఆలయాల వద్ద అభిమానుల రద్దీ నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు కల్పించాల్సి వచ్చింది.

