పుల్వామా ఘటన.. పాక్‌ నటులపై బ్యాన్‌ | AICWA Banned Pakisthan Actors From Cine Industry | Sakshi
Sakshi News home page

పుల్వామా ఘటన.. పాక్‌ నటులపై బ్యాన్‌

Feb 18 2019 2:56 PM | Updated on Mar 23 2019 8:04 PM

AICWA Banned Pakisthan Actors From Cine Industry - Sakshi

పుల్వామా ఘటనలో మన జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఘటనను ఖండించారు. వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు దేశ మొత్తం తోడుగా నిలిచింది. అయితే ఈ ఉగ్రదాడికి నిరసనగా ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే పాకిస్తాన్‌కు చెందిన నటీనటులను బ్యాన్‌ చేసింది. తమ సినిమాల్లో పాక్‌ నటీనటులను తీసుకోడానికి వీల్లేదంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ తన ‘టొటల్‌ ధమాల్‌’ను పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదంటూ ప్రకటించారు. అంతేకాకుండా చిత్రయూనిట్‌ తరుపున అమరులైన సైనిక కుటుంబాలకు రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement