భారత సంతతి మహిళ దుర్మరణం | Indian-origin woman falls to death from rooftop in Istanbul | Sakshi
Sakshi News home page

భారత సంతతి మహిళ దుర్మరణం

Sep 28 2015 3:04 PM | Updated on Sep 3 2017 10:08 AM

న్యూజిలాండ్కు చెందిన భారత సంతతి మహిళ ఓ హోటల్ భవనంపై నుంచి పడి మృతిచెందింది.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్కు చెందిన భారత సంతతి మహిళ ఓ హోటల్ భవనంపై నుంచి పడి మృతి చెందింది. కేషియా హందా (31) అనే మహిళ ఇస్తాన్బుల్లో సెప్టెంబర్ 19న గ్రాండ్ హోటల్ డి లాండ్రెస్ హోటల్లో ఏర్పాటు చేసిన టెర్రస్ పార్టీలో పాల్గొంది. పార్టీలో భాగంగా రెండు భవనాలను కలుపుతూ తాత్కాలికంగా 10 మీటర్ల వంతెనను నిర్మించారు.

ఈ నేపథ్యంలో ఆమె వంతెన పైభాగంలో డాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారిపడిపోయినట్టు అక్కడి హుర్రియత్ డెయిలీ న్యూస్ వెల్లడించింది. ఆస్ట్రేలియా బ్రిస్బేన్ సిటీలో పనిచేస్తున్న హందా.. ప్రపంచంలో జరిగే పలు డాన్స్ పార్టీల్లో తరచూ పాల్గొనేదంటూ ఆమె స్నేహితులు తెలిపారు. కాగా, సెప్టెంబర్ 16న జరిగిన సాల్సా పార్టీలో పాల్గొన్న ఆమె ...ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి హోటల్ను తనిఖీ చేసినట్టు వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement