కారుబాంబు దాడిలో 24 మంది మృతి | At least 17 dead in Baghdad car bomb | Sakshi
Sakshi News home page

కారుబాంబు దాడిలో 24 మంది మృతి

Apr 30 2016 2:12 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది.

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. బాగ్దాద్ ఆగ్నేయ ప్రాంతంలో జరిగిన కారుబాంబు దాడి ఘటనలో కనీసం 24 మంది మరణించగా, మరో 35 మంది గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు, పోలీసులు చెప్పారు.

షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని స్థానిక పోలీసులు చెప్పగా, భద్రత బలగాలు మాత్రం దుండగులు ఓపెన్ ఎయిర్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. కాగా షియాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో ఇలాంటి దాడులకు పాల్పడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement