సిరియాలో పేలుడు, 20 మంది మృతి | Sakshi
Sakshi News home page

సిరియాలో పేలుడు, 20 మంది మృతి

Published Wed, Oct 16 2013 1:45 PM

20 killed in Syria

సిరియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దక్షిణాది రాష్ట్రం డారాలోని నావా పట్టణంలో బుధవారం జరిగిన బాంబు పేలుడుకు దాదాపు 20 మంది మరణించగా, మరో 15 మందికిపైగా గాయపడ్డారు.

సిరియాలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా డారా రాష్ట్ర మీడియా ఈ విషయంపై స్పందించలేదు. పేలుడు గల కారణాలు పూర్తిగా తెలియాల్సివుంది. సిరియాలో ముస్లింల పండుగ రోజే ఈ ఘటన జరగడం ప్రజల్ని మరింత భయబ్రాంతులకు గురిచేసింది.

Advertisement
Advertisement