క్రిస్మస్‌ సంబరాల్లో విషాదం.. 30 మంది మృతి | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ సంబరాల్లో విషాదం.. 30 మంది మృతి

Published Tue, Dec 27 2016 2:59 AM

13 bodies found on Lake Victoria shores in Uganda Christmas tragedy

కంపాలా: ఉగాండాలో క్రిస్మస్‌ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. ఒక గ్రామానికి చెందిన ఫుట్‌బాల్‌ టీం సభ్యులు, అభిమానులు పడవలో క్రిస్మస్‌ సంబరాలు జరుపుకుంటుండగా పడవ నదిలో మునిగింది. ఆదివారం లేక్‌ ఆల్బర్ట్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు పోలీస్‌ కమాండర్‌ జాన్‌ రుటాగిరా చెప్పారు. ‘పడవలో సామర్థ్యానికిమించి 45 మంది ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది డ్యాన్స్‌ చేస్తుండగా, మరికొంతమంది మద్యం తాగుతున్నారు. ఒక్కసారిగా అందరూ ఒకేవైపునకు వెళ్లడంతో పడవ తిరగబడింది’ అని చెప్పారు. 15 మందిని రక్షించారు.

Advertisement
Advertisement