వైద్య సేవల్లో కీలకమైన పారామెడికల్ పోస్టుల భర్తీలో నెలకొన్న అయోమయానికి తెరపడింది.
వైద్యశాఖలో 1,775 పారామెడికల్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మేలో అనుమతినిచ్చిన ప్రభుత్వం వాటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్హతలు, ఎంపిక పద్ధతిపై స్పష్టత లేకపోవడంతో పోస్టుల భర్తీ విషయంలో విధానాలను నిర్దిష్టంగా తెలపాలని టీఎస్పీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంప గా వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వోద్యోగాల భర్తీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రా« దాన్యత ఇవ్వరాదనే ప్రభుత్వ సర్వీసు నిబంధనల్లోని 9బి అంశాన్ని ఈ పోస్టుల భర్తీకి మినహాయించింది. వైద్య శాఖలో పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, రేడియోగ్రాఫర్, గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్–2 ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ(ఎఫ్), ఫిజియోథెరపిస్ట్ పోస్టుల్లో ఎక్కువ మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.