కోవర్టుల పనే..? | This is happen because of informers | Sakshi
Sakshi News home page

కోవర్టుల పనే..?

Oct 25 2016 3:54 AM | Updated on Mar 28 2019 5:07 PM

ఏఓబీ ఎన్‌కౌంటర్ కోవర్టుల కారణంగానే జరిగిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్:  ఏఓబీ ఎన్‌కౌంటర్ కోవర్టుల కారణంగానే జరిగిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులను కలిసే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. సోమవారం నాటి ఘటనా స్థలంలో ఆర్కే సహా మరికొందరు అగ్రనేతలు ఉన్నారని సమాచారం. ఒడిశా పోలీసులు కన్నెత్తి చూడని సురక్షిత ప్రాంతం కాబట్టే మావోయిస్టు అగ్రనేతలు, దళాలు అక్కడికి చేరుకున్నారని తెలుస్తోంది. పక్కా చిరునామా (పిన్ పాయింట్) దగ్గర ఉండి చూపేవారుంటేనే పోలీసులు అంత లోపలికి రావడం సాధ్యమంటున్నారు. కోవర్టుల సమాచారంతోనే పోలీసులు అక్కడికి వెళ్లగలిగారని అంటున్నారు.

మరోవైపు మావోయిస్టులు తిన్న ఆహారంలో విష ప్రయోగం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏటా నవంబర్, డిసెంబర్ మధ్య మావోయిస్టుల సమావేశాలు జరుగుతాయని, ఆ సమాచారంతోనే నిఘా పెట్టి ఉంటారని తెలుస్తోంది. ‘‘మావోయిస్టులు ఆ ప్రాం తాన్ని షెల్టర్ జోన్‌గా వాడుకుంటారు. పక్కా సమాచారంతోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది’’ అని గ్రేహౌండ్స్‌లో అనుభవమున్న ఓ పోలీసు అధికారి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement