చారిత్రక నగరిలో సాహిత్య వికాసం | The historical development of literary Nagri | Sakshi
Sakshi News home page

చారిత్రక నగరిలో సాహిత్య వికాసం

Jan 14 2016 4:17 AM | Updated on Mar 28 2019 5:35 PM

చారిత్రక నగరిలో సాహిత్య వికాసం - Sakshi

చారిత్రక నగరిలో సాహిత్య వికాసం

1901 భాగ్యనగరిలో సాహిత్య పునర్వికాసానికి బీజంపడింది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించడంతో

1901 భాగ్యనగరిలో సాహిత్య పునర్వికాసానికి బీజంపడింది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించడంతో హైదరాబాద్ రాష్ట్రంలో సాహిత్య, సాంస్కృతిక వికాసం కొత్త పుంతలు తొక్కింది. కొమర్రాజు వెంకటలక్ష్మీ నరసింహారావు ఈ ఉద్యమానికి సారథిగా నిలిచారు. ఆ తర్వాత 1904లో సికింద్రాబాద్‌లోనూ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర దేశ సంస్కృతీ వారసత్వాలను గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, ఆంధ్రుల పూర్వవైభవంపై తెలుగు ప్రజలను చైతన్య దీప్తులను చేయడానికి, ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవడానికి ఈ గ్రంథాలయాలు ఎంతోగానో  దోహదం చేశాయి. ఇవి క్రమంగా తెలుగు పునర్వికాస ఉద్యమానికి కేంద్ర బిందువులుగా మారాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement