'ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది' | telangana pcc chief uttamkumar reddy attack on trs government | Sakshi
Sakshi News home page

'ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది'

Feb 17 2016 5:45 PM | Updated on Sep 19 2019 8:44 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలను సడలించడం ద్వారా కొన్ని కంపెనీలకే ప్రాజెక్టుల టెండర్లు వచ్చేలాగా చేసి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత- చేవెళ్ల టెండర్లలో భారీగా అవినీతి జరిగిందన్నారు.

కొన్ని ప్యాకేజీలైతే టెండర్లు లేకుండానే నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు పనులను ఖరారు చేశారని ఉత్తమ్ ఆరోపించారు. తొలుత 600 కోట్లుగా అంచనాలు వేసిన ఓ ప్యాకేజీని తరువాత 3 వేల కోట్లకు అంచనా పెంచి పాత కాంట్రాక్టర్కే అప్పగించారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న లక్ష కోట్లకు సంబంధించిన పనుల్లో పారదర్శకత లోపించిందని ఆయన విమర్శించారు. ఈ టెండర్ల విధానాన్ని రద్దు చేసి గ్లోబల్ టెండర్లను పిలవాలని నీటిపారుదల శాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement