'శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు' | seven checkposts in shamsabad circle | Sakshi
Sakshi News home page

'శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు'

Sep 2 2015 7:09 PM | Updated on Sep 3 2017 8:37 AM

గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శంషాబాద్ పరిధిలో ఏడు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. వినాయకచవితి, బక్రీద్ పండగల సందర్భంగా శంషాబాద్ డీసీపీ కార్యాలయం ఆవరణలో బుధవారం డివిజన్ స్థాయి శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకచవితి, బక్రీద్ పండగలను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గోవులను రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement