మళ్లీ మండిన పెట్రో, డీజిల్ ధరలు.. పె ట్రోల్ లీటర్పై రూ.2.35, డీజిల్పై 50 పైసలు పెరిగాయి.
సాక్షి, సిటీబ్యూరో : మళ్లీ మండిన పెట్రో, డీజిల్ ధరలు.. పె ట్రోల్ లీటర్పై రూ.2.35, డీజిల్పై 50 పైసలు పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్లో పన్నులు కలిపి లీటర్ పెట్రోల్పై రూ.3.08, డీజిల్పై 61 పైసలు పెరిగినట్లయింది. ప్రస్తుతం పెట్రోల్ లీ టర్ రూ.77.85. తాజాగా రూ.80.93కి చేరిం ది. డీజిల్ రూ.56.04 నుంచి రూ.56.65కి చేరిం ది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.
పెరిగిన ధరలతో గ్రేట ర్వాసులపై నెలకు రూ.33.75 కోట్ల భారం పడనుంది. గ్రేటర్లో సుమారు 40 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్ష లు, డీజిల్తో నడిచే వాహనాలు 11 లక్షల వరకు ఉంటాయని అంచనా. రోజూ సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది.