మోదీని కేసీఆర్ కలిశాకే ఆ అవకాశం | Palla Rajeswar Reddy prices CM kcr | Sakshi
Sakshi News home page

మోదీని కేసీఆర్ కలిశాకే ఆ అవకాశం

Nov 23 2016 3:29 AM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీని కేసీఆర్ కలిశాకే ఆ అవకాశం - Sakshi

మోదీని కేసీఆర్ కలిశాకే ఆ అవకాశం

పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని ప్రధానికి తెలిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

పాత నోట్లతో రైతులకు విత్తనాల కొనుగోలు వెసులుబాటుపై పల్లా 

 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని ప్రధానికి తెలిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మోదీని కేసీఆర్ కలసిన తర్వాతే రైతులకు పెద్ద నోట్లతో విత్తనాలు కొనే అవకాశం లభించిందని తెలిపారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యలు తీసుకుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో కేసీఆర్ నిర్మాణాత్మక వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement