► తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు
► ఈ నెల 30న కేరళను తాకుతాయి: ఐఎండీ
► ఈ నెల 29కే.. స్కైమెట్ అంచనా
సాక్షి నాలెడ్జ్ సెంటర్: మాడు పగిలే ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు. వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేందుకు రుతుపవనాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో.. అంటే ఈ నెల 30వ తేదీల్లోనే కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే అంతకంటే ఒక రోజు ముందే రుతుపవనాలు తాకుతాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ ప్రకటించింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాల విస్తరణ, ప్రభావం కొంచెం మెరుగ్గా ఉంటుందని స్కైమెట్ శాస్త్రవేత్త ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నాలుగు నెలల రుతుపవనాల సీజన్ మొత్తమ్మీద వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 95 శాతం వరకూ ఉండవచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది.
నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకి.. ఆ తర్వాత దశలవారీగా జూలై 15 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. అయితే గత ఏడాది ఎల్నినో కారణంగా రుతుపవనాల రాక, విస్తరణలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. వారం ఆలస్యంగా తీరాన్ని తాకిన మేఘాలు ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయాయి. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉండబోతోందని స్కైమెట్ అంచనా వేస్తోంది. కొన్నిరోజులుగా కేరళతోపాటు, తమిళనాడు అంతర్భాగాల్లో ముందస్తు వానలు కురుస్తుండగా.. ఈ నెల 25 నుంచి ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. విదర్భ, తెలంగాణ వంటి దేశ మధ్య ప్రాంతాల్లో భూమి ఉపరితలం బాగా వేడెక్కి ఉండటం బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడేందుకు, తద్వారా రుతుపవనాల రాకకు తోడ్పడతాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. రెండు నెలల క్రితం ఉన్న ఎల్నినో పరిస్థితుల స్థానంలో బలహీనమైన లానినా పరిస్థితులు ఏర్పడటం కూడా రుతుపవనాలపై ప్రభావం చూపుతోంది. మే చివరికల్లా కేరళ తీరాన్ని తాకే సమయానికే దీని ప్రభావంతో కేరళ, కర్ణాటకలతోపాటు తెలంగాణ, ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని.. స్కైమెట్ అంటోంది. అలాగే జూన్ నెలలో తెలంగాణ, ఏపీలో తగినన్ని వర్షాలు కురుస్తాయని.. సగటు వర్షపాతానికి ఒకట్రెండు శాతం ఎక్కువ వానలు కురిసినా కురవవచ్చని అంచనా వేస్తోంది.
రుతుపవనాలు వచ్చేస్తున్నాయి!
Published Wed, May 17 2017 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement