‘సాక్షి’తో కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి
- నీట్ నేపథ్యంలో ఎంసీఐ ఒక నెల గడువు పొడిగించింది
- ఎంసెట్-2కు జూలై ఆఖరుకల్లా తొలి విడత కౌన్సెలింగ్
- ఆగస్టు నుంచే తొలి విడత బ్యాచ్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఆగస్టు 31వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి సెప్టెంబర్ చివరి దాకా కొనసాగనుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి తెలిపారు. ఎంసెట్-2 షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎంసెట్ను జూలై 9వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎంసెట్-2ను విద్యార్థుల సంఖ్యను బట్టి దాదాపు 200 కేంద్రా ల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నీట్ ద్వారా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపడుతున్నందున ఆలస్యం కానుందని.. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ చివరి నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు ఎంసీఐకి అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ నేపథ్యం లో నిర్వహించే ఎంసెట్-2 పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి జూలై ఆఖరి వారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. విద్యార్థుల చేరికలు పూర్తయ్యాక... ఆగస్టులోనే తొలి బ్యాచ్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక రెండో విడత కౌన్సెలింగ్, అవసరమైతే మూడో విడత కూడా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
వెబ్ కౌన్సెలింగ్పై ఆలోచన
ఆన్లైన్ కౌన్సెలింగ్ కాకుండా పీజీ వైద్య సీట్లకు నిర్వహించినట్లుగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కూడా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామని కరుణాకర్రెడ్డి చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ వల్ల విద్యార్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి రాకుండానే తమ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చన్నారు. దీనివల్ల వేగంగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంతో కలిసే మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో 15 శాతం అన్ రిజర్వ్డ్ సీట్లు ఉన్నందున కలిసే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంసెట్ ఫలితాలు ఇప్పటికే వచ్చినా రెండు రాష్ట్రాల కౌన్సెలింగ్ల మధ్య ఎక్కువ రోజు ల తేడా ఉండబోదన్నారు. తెలంగాణ సీట్లకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ అంతా హైదరాబాద్, వరంగల్లోనే జరుగుతుందన్నారు.
వచ్చేనెల మొదటివారంలో నీట్-2 నోటిఫికేషన్!
నీట్-2కు వచ్చేనెల మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కరుణాకర్రెడ్డి తెలిపారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామన్నారు. నీట్ ర్యాంకులు ప్రకటించాక సీట్ల భర్తీ ప్రక్రియ ఎలా చేపట్టాలన్న అంశంపై మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. మార్గదర్శకాలు వచ్చాక సీట్ల భర్తీ ప్రక్రియపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.
సెప్టెంబర్ చివరి దాకా మెడికల్ అడ్మిషన్లు
Published Thu, May 26 2016 3:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement