వివాహ్
అందమైన భామలు సంప్రదాయ సిరులు ఒలికించారు. పట్టు పరికిణీలు, చీరల్లో వయ్యారాల సింగారాలు కురిపించారు. బంజారాహిల్స్ హోటల్ తాజ్కృష్ణాలో మంగళవారం ప్రారంభమైన ‘ట్రెండ్జ్’ వివాహ కలెక్షన్ ఎక్స్పోలో కలర్ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. అరవై మందికి పైగా మాస్టర్ డిజైనర్లు రూపొందించిన లక్షకు మించిన డిజైన్లు మగువ మనసు దోస్తున్నాయి.
పెళ్లికి కావల్సిన వస్త్రాభరణాలన్నీ ఇందులోని స్టాల్స్లో కొలువుదీరాయి. వీటితోపాటు మెటాలిక్, నాన్ మెటాలిక్, ఎత్నిక్ జ్యువెలరీ జిగేల్మంటోంది. తేతార్ ఫర్నిషింగ్స్, హోమ్ యాక్ససరీస్ వంటివెన్నో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం వరకు ఎక్స్పో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.