కింగ్ ఫిషర్ అధికారికి జైలు శిక్ష ఖరారు | Mallya cheque bounce cases: Court sends Kingfisher official Raghunathan to 18-month jail | Sakshi
Sakshi News home page

కింగ్ ఫిషర్ మాజీ అధికారికి జైలు శిక్ష ఖరారు

Sep 22 2016 3:24 PM | Updated on Sep 4 2017 2:32 PM

పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు కింగ్ ఫిషర్ ముఖ్య అధికారి ఎ.రఘు నాథన్ కు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

హైదరాబాద్ : పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ..కింగ్ ఫిషర్ ఎయిర్  లైన్స్   చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ ప్రత్యేక  కోర్టు  గురువారం శిక్షను ఖరారు చేసింది. ఈ  కేసులో దోషిగా తేలిన కింగ్ ఫిషర్  మాజీ ముఖ్య  అధికారి  ఎ  ఎ. రఘు నాథన్  కు18 నెలల  జైలు  శిక్షవిధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో  కింగ్ ఫిషర్ మాజీ అధినేత మాల్యా కూడా దోషిగా తేలినప్పటికీ,  ఆయన విదేశాలకు పారిపోవడంతో  శిక్ష ఖరారు వాయిదా  పడుతోంది.


కాగా   శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఇచ్చిన  50  లక్షల రూపాయల విలువ గల  రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్ లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది.  కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా  తేల్చిల్చింది. కానీ  విజయ్ మాల్యా గైర్హాజరుతో  మాల్యా పరోక్షంలో  శిక్షను ఖరారు చేయలేమని  చెప్పిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement