కామినేని ఆస్పత్రిలో బంధువుల ఆందోళన
మన్సూరాబాద్ : చనిపోయిన వ్యక్తికి కామినేని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసినట్లు రోగి బంధువులు ఆరోపించారు. బంధువుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన నాగులంచి శ్రీనివాస్రెడ్డి(48) లారీలోని ఐరన్ షీట్లు అన్ లోడ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. అడ్వాన్స్గా రూ.75 వేలు చెల్లించారు. రోగికి చికిత్స చేయాలంటే మరో రూ.1.50 లక్షలు చెల్లించాల్సిందిగా ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అంత మొత్తం తమ వద్ద లేదని, డిశ్చార్జ్ చేస్తే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తామని అతడి బంధువులు కోరారు.
ప్రస్తుతం రోగి వెంటిలేటర్పై ఉన్నాడని, డిశ్చార్జ్ చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనుమానం వచ్చి కొంత మంది ఐసీయూలోకి వెళ్లి పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గమనించారు. ఆస్పత్రి వైద్యులు చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నట్లు నటిస్తూ తమ నుంచి భారీగా డబ్బులు గుంజేందుకు యత్నించారని ఆరోపిస్తూ వుృతుని భార్య పద్మ, కుమార్తె దివ్య, కుమారుడు సంపత్రెడ్డి సహా పలువురు బంధువులు ఆస్పత్రి వుుందు ఆందోళనకు దిగారు. ఈ విషయమై కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
మృతి చెందిన వ్యక్తికి చికిత్స..!
Published Sun, May 31 2015 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement