రేపల్లె ప్యాసింజర్‌ ఇక ఎక్స్‌ప్రెస్‌ | kachiguda repalle passenger is converted to express | Sakshi
Sakshi News home page

రేపల్లె ప్యాసింజర్‌ ఇక ఎక్స్‌ప్రెస్‌

Jun 22 2017 12:35 PM | Updated on Sep 5 2017 2:14 PM

కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌: కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైలు వేగాన్ని కూడా పెంచింది. దీనివల్ల ప్రయాణికులు గతంలో కంటే గంట ముందుగానే గమ్యస్థానం చేరుకుంటారని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అక్టోబరు 19 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
 
కాచిగూడ-రేపల్లె, తిరుగు ప్రయాణంలో రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. ఈ రైలు కాచిగూడ(కొత్త నెం.17625) నుంచి ప్రతిరోజు రాత్రి 10.10 గంటలకు బయల్దేరి తెల్లవారుజామున 6.10కి రేపల్లె చేరుకుంటుంది. రేపల్లె(17626) నుంచి రాత్రి10.30కి బయల్దేరి ఉదయం 7.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement