బ్రాహ్మణులకు సీఎం వరాల జల్లు | cm kcr meeting with Brahmin Celebrities and officers in hyderabad | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణులకు సీఎం వరాల జల్లు

Oct 23 2016 6:47 PM | Updated on Aug 14 2018 10:54 AM

బ్రాహ్మణులకు సీఎం వరాల జల్లు - Sakshi

బ్రాహ్మణులకు సీఎం వరాల జల్లు

బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

హైదరాబాద్ : రాష్ట్రంలోని బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు వరాలజల్లు కురిపించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆదివారం బ్రాహ్మణ ప్రముఖులు, అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు.
 
బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుపై ఈ సమావేశంలో సీఎం ప్రత్యేకంగా చర్చించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో 10 నంచి 12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదన్ నిర్మిస్తామన్నారు. రూ.100 కోట్లతో బ్రాహ్మణ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ అరవిందరావు తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. దీనికి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్రాహ్మణ ప్రముఖులు సీఎం కేసీఆర్ను అభినందించారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement