సంపులో పడి బాలుడి మృతి | child died in water vols in hyderabad | Sakshi
Sakshi News home page

సంపులో పడి బాలుడి మృతి

Oct 27 2015 11:22 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు సంపులో పడి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

గచ్చిబౌలి: ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు సంపులో పడి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికంగా అంజయ్య నగర్‌లో నివాసం ఉంటే రంగస్వామి, సుజాత దంపతుల కుమారుడు చందు (5) సోమవారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు.

అతని కోసం తల్లిదండ్రులు రాత్రంతా వెతికినా కనిపించలేదు. మంగళవారం ఉదయం వారు నివాసం ఉండే వీధిలోనే ఓ ఇంటి సంపులో చందు మృతదేహం బయటపడింది. స్థానికులు రాయదుర్గం పోలీస్ స్టేషన్కు సమాచారం అందిచడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement