కొనసాగుతున్న వాయిదాల పర్వం | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వాయిదాల పర్వం

Published Thu, Dec 17 2015 11:06 AM

కొనసాగుతున్న వాయిదాల పర్వం - Sakshi

ఏపీ అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం మీద చర్చకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడం, అధికార పక్షం దానికి ససేమిరా అనడంతో ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి రెండుసార్లు పదేసి నిమిషాల చొప్పున సభ వాయిదా పడింది. తొలిసారి సభ పది నిమిషాలే వాయిదా పడినా.. దాదాపు అరగంట తర్వాత గానీ తిరిగి సమావేశం కాలేదు.

సమావేశమైన తర్వాత కూడా వైఎస్ఆర్‌సీపీ సభ్యులు కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టడం, స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో స్పీకర్ సభను మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకుముందు, కెమెరాకు అడ్డుగా నిలబడి ప్రత్యక్ష ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఎమ్మెల్యే డి.రాజాకు హెచ్చరిక చేశారు.

Advertisement
Advertisement