స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో మరో పిటిషన్
⇒ ఏపీఐడీఈ చట్టానికి సవరణల ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం
⇒ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు, ప్రజాప్రయోజనాలకూ విరుద్ధమే
⇒ సింగపూర్ కన్సార్టియం కోసమే చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు
⇒ దేశీయ బిడ్డర్లను పోటీ నుంచి తప్పించేందుకు ఎత్తులు
⇒ నిబంధనలు, ఆర్థిక అర్హతలు అన్యాయంగా ఉన్నాయి
⇒ ‘స్టార్టప్ ఏరియా అభివృద్ధి’ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కాదు
⇒ అది పూర్తిగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే.. ప్రస్తుత బిడ్డింగ్ రద్దు చేయాలి
⇒ ఓపెన్ బిడ్డింగ్ విధానం ద్వారా టెండర్ల ప్రక్రియను చేపట్టాలి
⇒ మొత్తం వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. స్విస్ చాలెంజ్ వి ధానం కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఇచ్చిన జీవో 170కి సవరణ చేస్తూ ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో 1ను సవాలు చేస్తూ చెన్నైకి చెందిన ‘ఎన్వియన్ ఇం జనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధి కె.శ్రీధర్ రావు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశా రు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జనవరి 2న జారీ చేసిన జీవో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్ట నిబంధనలకు విరుద్ధమని ఎన్వియన్ సంస్థ తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్, టెండర్ ప్రక్రియను రద్దు చేసి, తాజాగా ఓపెన్ బిడ్డింగ్ విధానం ద్వారా టెండర్ల ప్రక్రియను చేపట్టేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఏపీఐడీఈ చట్ట నిబంధనలు తూచ్
‘‘రాజధానిలో 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి నిమిత్తం సింగపూర్కు చెందిన అసెండాస్–సింగ్బ్రిడ్జ్– సెంబ్కార్ప్ కంపెనీల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడి(ఓపీపీ)గా స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిష నర్ గతేడాది ఆగస్టు 18న టెండర్ నోటిఫికేష న్ జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో గడువు తేదీని పెంచడంతోపాటు బిడ్ల ప్రక్రియను రెండుగా విభజిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ మొత్తం వ్యవహారం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం పలు అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించారు. రెండు నోటిఫికేషన్ల అమలుపై స్టే విధిస్తూ గతేడాది సెప్టెంబర్ 12న మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ వేర్వేరుగా రిట్ అప్పీళ్లు దాఖలు చేశాయి. ఏపీ ఐడీఈ చట్టానికి సవరణలు చేస్తున్నట్లు విచార ణ సమయంలో అడ్వొకేట్ జనరల్ నివేదించా రు. దీంతో ధర్మాసనం ఈ అప్పీళ్లను పరిష్కరి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీఐడీఈ చట్టానికి పలు సవరణ లు తీసుకొచ్చింది. చట్టంలో రాజీ ప్రక్రియకు ఆస్కారం లేకుండా చేశారు. పోటీతత్వాన్ని నిరోధించి, కొందరికి మాత్రమే బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం కల్పించేందుకు వీలుగా అర్హులైన బిడ్డర్లు అన్న పదాన్ని చేర్చారు.
సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగా చట్టాన్ని సవరించారు. కన్సార్టియంకు లబ్ధి చేకూర్చేందుకు చట్టంలో సవరణలు చేసిన ప్రభుత్వం, పోటీ ప్రతిపాదనలను ఆహ్వానించడాన్ని నామమాత్రం చేసేసింది. గత నెల 3న తాజా టెండర్లు ఆహ్వానిస్తూ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో బిడ్డింగ్ ప్రక్రియను రెండంచెల ప్రక్రియగా మార్చింది. మొదట వచ్చిన దరఖాస్తుల్లో బిడ్డర్లకు అర్హతలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. అర్హతలు ఉంటేనే రెండో దశకు ఎంపిక చేస్తారు. ఇది ఏకపక్ష నిర్ణయమే కాకుండా, వివక్షతో కూడుకున్నది కూడా. ఈ నిర్ణయంలో పారదర్శకత లోపించింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఏపీఐడీఈ చట్ట నిబంధనలు వర్తించకుండా చేశారు. కాబట్టి ఇది మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కానేకాదు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమే అవుతుంది’’ అని ఎన్వియన్ సంస్థ తన వ్యాజ్యంలో స్పష్టం చేసింది.
ఇది స్విస్ చాలెంజ్ నిర్వచనం పరిధిలోకి రాదు
‘‘సింగపూర్ కంపెనీల కన్సార్టియం కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం ప్రక్రియను మార్చేసింది. ప్రభుత్వం తన ఇష్టాయిష్టాలకు అనుగు ణంగా వ్యవహరిస్తోంది. అసలు ఇది స్విస్ చాలెంజ్ నిర్వచనం పరిధిలోకే రాదు. ఓపీపీ సుమోటో(తనంతట తాను)గా ప్రతిపాదనలు సమర్పించినప్పుడే అది స్విస్ చాలెంజ్ అవుతుంది. కానీ, ప్రభుత్వం ఇక్కడే ముందే నిర్ణయం తీసుకుని, సింగపూర్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఆ తరువాత ప్రతిపాదనలు స్వీకరించింది. ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు, ప్రజాప్రయోజనాలకు కూడా విరుద్ధం. నిబంధనలు, ఆర్థిక అర్హతలు, ప్రాసెసింగ్ ఫీజులు, బిడ్ సెక్యూరిటీ తదితరాలన్నీ కూడా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నిర్ణయించింది.
పోటీని వీలైనంత కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకే ఇలా చేసింది. దేశీయ డెవలపర్లను పోటీ నుంచి తప్పించే దిశగా అర్హతలను నిర్ణయించింది. సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలు, ఆదాయ వాటాను చూడకుండానే గుడ్డిగా ఆమోదించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు ప్లాట్ల అమ్మకాలకు ఉద్దేశించింది. కాబట్టి దీన్ని ఏపీఐడీఈ చట్టం కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు అనలేం. థర్డ్ పార్టీలకు అమ్మేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించినందున ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే అవుతుంది. అర్థిక అర్హతలను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించింది.
బిడ్డర్ నికర విలువ రూ.2,000 కోట్లు ఉండాలంది. ప్రాజెక్టును 20 ఏళ్లలో మూడు దశల్లో పూర్తి చేయాలంది. దేశీయ డెవలపర్లను పోటీ నుంచి తప్పించేందుకే ఇలాంటి నిబంధనలను నిర్దేశించారు. సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక బిడ్ ప్రాసెస్ ఫీజును రూ.25 లక్షలుగా, బిడ్ సెక్యూరిటీని రూ.6.35 కోట్లుగా నిర్ణయించింది. ఈ బిడ్ సెక్యూరిటీని సింగపూర్ కంపెనీల కన్సార్టియం నుంచి తీసుకున్నారో లేదో ఎక్కడా చెప్పలేదు’’ అని ఎన్వియన్ కంపెనీ తన పిటిషన్లో పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరింది.
‘స్విస్’పై మళ్లీ చాలెంజ్
Published Tue, Feb 21 2017 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement