విరాళాలిచ్చే వారికి ఈ-పాస్‌బుక్కులు | TTD give the benefits to the one lakh rupees Donor | Sakshi
Sakshi News home page

విరాళాలిచ్చే వారికి ఈ-పాస్‌బుక్కులు

Mar 18 2017 8:08 PM | Updated on Aug 25 2018 7:11 PM

విరాళాలిచ్చే వారికి ఈ-పాస్‌బుక్కులు - Sakshi

విరాళాలిచ్చే వారికి ఈ-పాస్‌బుక్కులు

టీటీడీ ట్రస్టులకు విరాళాలు ఇచ్చిన దాతలకు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తిరుమల: తిరుమలలో భక్తుల సౌకర్యాలు, ఆథ్యాత్మిక, ధార్మికతతోపాటు సామాజిక సేవల్లో భాగంగా విద్య, వైద్య సేవల నిర్వహణ చేపట్టారు. వీటి కోసం టీటీడీ ట్రస్టులకు విరాళాలు ఇచ్చిన దాతలకు పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దాతలకు పారదర్శకంగా బస, శ్రీవారి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు ఇప్పటికే టీసీఎస్‌ సహకారంతో దేవస్థానం ఐటీ విభాగం ‘డోనార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఆన్‌లైన్‌ అíప్లికేషన్‌’ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే టీటీడీలోని 9 ట్రస్టులు, ఒక స్కీమ్‌కు రూ.10 లక్షలు, ఆపైన విరాళాలందించిన దాతలందరికీ  ఈ–పాస్‌బుక్‌లు అందించే ప్రక్రియను టీటీడీ వేగవంతం చేసింది. దాతలు ఇంటెర్నెట్‌ ద్వారా స్వయంగా ఈ–పాస్‌బుక్‌ పొందే సౌలభ్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. ఇలా ఇప్పటికే సుమారు ఐదు వేల మంది దాతలు ఆన్‌లైన్‌లో ఈ–పాస్‌బుక్‌లు పొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement