సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు.
నేరాలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి సికింద్రాబాద్ రెల్వేస్టేషన్ సమీపంలోని రెజిమెంటల్ బజార్లో కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.