ఆర్ట్ ఎట్ మ్యూజ్ | Art Expo opened by K. Taraka Rama Rao | Sakshi
Sakshi News home page

ఆర్ట్ ఎట్ మ్యూజ్

Oct 14 2014 1:17 AM | Updated on Aug 15 2018 7:56 PM

ఆర్ట్ ఎట్ మ్యూజ్ - Sakshi

ఆర్ట్ ఎట్ మ్యూజ్

తారామతి బారాదరిలో పల్లవించిన కుంచె.. మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో పరవశించింది. ఆర్ట్ ఎట్ తెలంగాణ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో 90 మంది కళాకారులు కన్వాస్‌పై చిలకరించిన రంగులు..

తారామతి బారాదరిలో పల్లవించిన కుంచె.. మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో పరవశించింది. ఆర్ట్ ఎట్ తెలంగాణ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో 90 మంది కళాకారులు కన్వాస్‌పై చిలకరించిన రంగులు.. కళాప్రియులను పులకరింపజేస్తున్నాయి. ప్రకృతి కాంత హొయలు, పల్లె పడుచు చిత్రం, గిరిజన వనిత జీవనం.. ఇలా ఎన్నో అంశాలను ప్రతిబింబించిన చిత్రరాజాలు అందర్నీ కట్టిపడే స్తున్నాయి.  మంత్రి కె.తారకరామారావు, ఎంపీ కె.కేశవరావు సోమవారం ఈ ఆర్ట్ ఎక్స్‌పోను ప్రారంభించారు. ఈ ఎక్స్‌పో 15 రోజులపాటు అలరించనుంది. ఈ సందర్భంగా ఆర్ట్ ఎట్ తెలంగాణ వెబ్‌సైట్ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement