రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణించారని అంటే జాలి చూపని మనిషి ఉండడు. తెలిసిన వాళ్లు అయినా, తెలియని వాళ్లు అయినా ప్రమాదంలో మరణించారని తెలిస్తే అయ్యోపాపం.. అని అంటాం. అయితే ప్రత్యక్షంగా కళ్లెదుట జరిగే ప్రమాదాల విషయంలో కూడా ఇలాంటి స్పందనే వ్యక్తం చేసే మనుషులు మనలో తక్కువ. ప్రయాణ సమయంలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, బాధితులు కళ్ల ముందే కనిపిస్తున్నా... తమదారిన తాము వెళ్లిపోయే వాళ్లే ఎక్కువమంది. ఎందుకంటే... పనుల మొదలు పోలీసుల భయం... దాకా ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. అలాంటి అనుభవమే ఎదురైంది వంశీ, వైశాలి దంపతులకు.
ఉద్యోగస్తులైన ఈ భార్యభర్తలు ఇటీవల హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలో కారులో వెళుతున్నారు. అక్కడ ఒక చోట చాలా మంది గుమి కూడి ఉన్నారు. వారిని తప్పించుకొని కొంచెం తొంగిచూస్తే ఒక మనిషి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వయసుకు వృద్ధుడిలానే ఉన్నాడు. ఏదో భారీ వాహనం నడుస్తూ వెళుతున్న ఆ మనిషికి కొట్టేసి వెళ్లిపోయినట్టుగా జనాలు మాట్లాడుకొంటున్నారు. అక్కడ అయ్యోపాపం అనే మాటలు వినిపస్తున్నాయి కానీ... ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆ మనిషిని ఆసుపత్రికి తీసుకెళదామనే ఆలోచన ఎవరి రాలేదు. ఎవరూ అతడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడమే అందుకు రుజువు.
ఈ పరిస్థితిని గమనించిన వంశీ, వైశాలి దంపతులు వినోదం చూస్తున్న మనుషులను పట్టించుకోకుండా... ప్రమాదంలో ఉన్న మనిషి గురించి ఆలోచించారు. తమ కారును తీసుకొచ్చి ప్రమాదానికి గురైన వ్యక్తిని బ్యాక్ సీటులో కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను అడ్మిట్ చేసి వైద్యం అందేలా చేసి వివరాలను కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆయన పేరు క్రిస్టఫర్ అని తెలిసింది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిశాయి. వాళ్లు వచ్చేంత వరకూ క్రిస్టఫర్ బాధ్యతను వంశీ, వైశాలి దంపతులే చూసుకొన్నారు. సమయానికి ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆ దంపతులకు క్రిస్టోఫర్ కుటుంబీకులు ఎంతో కృతజ్ఞత చూపారు. ఈ విషయాన్ని వాళ్లే రోడ్క్రాఫ్ట్ అనే ఎన్జీవోకు తెలిపారు.
ఆ ఎన్జీవో రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో సిసలైన మనుషుల్లా ప్రవర్తించే వ్యక్తులను సత్కరిస్తూ ఉంటుంది. వంశీ, వైశాలి దంపతులకు కూడా ఆ ఎన్జీవో వాళ్లు ‘గుడ్ సమరిటన్’ అవార్డును ఇచ్చారు. ఇలాంటి అవార్డుల మాట ఎలా ఉన్నా.. వంశీ, వైశాలిలు మాత్రం అభినందనీయులు.
మేల్కొన్న మానవత్వం
Published Wed, Sep 17 2014 12:32 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement