'పీఆర్పీ రైలు హైదరాబాద్‌ రాకుండానే ఆగిపోయింది' | Prajarajyam Train not reached to Hyderabad, says Kalvakuntla Kavitha | Sakshi
Sakshi News home page

'పీఆర్పీ రైలు హైదరాబాద్‌ రాకుండానే ఆగిపోయింది'

Apr 28 2014 9:45 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పీఆర్పీ రైలు హైదరాబాద్‌ రాకుండానే ఆగిపోయింది' - Sakshi

'పీఆర్పీ రైలు హైదరాబాద్‌ రాకుండానే ఆగిపోయింది'

బీజేపీ అంటే బాబు జేబు పార్టీ అని టీఆర్‌ఎస్ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి కె.కవిత విమర్శించారు.

నిజామాబాద్: బీజేపీ అంటే బాబు జేబు పార్టీ అని టీఆర్‌ఎస్ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి కె.కవిత విమర్శించారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న చంద్రబాబు నాయుడుతో కలసి పొత్తు పెట్టుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తెలంగాణ అమరవీరులకు ఏనాడూ నివాళులు అర్పించలేదని, ఉద్యమానికి కూడా మద్దతు తెలుపలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు.

‘నీకు తిక్కనే ఉంది లెక్కలేదు.. ఆకాశం వైపు ఉమ్మివేస్తే అది నీపైనే పడుతుంది. కేసీఆర్‌ను తిట్టే నైతిక హక్కు, స్థాయి నీకు లేదు’ అని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. పవన్ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రైలు తిరుపతిలో ప్రారంభమై హైదరాబాద్‌కు రాకుండానే ఆగిపోయిందని దెప్పిపొడిచారు. అవసరానికి తగినట్లు మాట్లాడే మీరు విలన్లు అంటూ మండిపడ్డారు. నిజమైన హీరోలు, కథానాయకులు తెలంగాణ బిడ్డలేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement