పటాన్చెరు,న్యూస్లైన్: పటాన్చెరు మండలం పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తొలుత సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తారని అధికారులు తెలిపారు. కానీ అక్కడ వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కౌంటింగ్ కేంద్రాన్ని సంగారెడ్డిలోని పాత వెలుగు (డీఆర్డీఏ) కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కేటాయించిన గది చిన్నగా ఉండ టంతో 11 టేబుళ్లకు బదులుగా 8 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల సంఖ్యకు అనుగుణంగా 14 టేబుళ్లు వేసినా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగదని అలాంటిది ఎనిమిది టేబుళ్లపై కౌంటింగ్ చేయడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు.
గతంలో కూడా అమీన్పూర్ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు అర్థరాత్రి దాటిన తర్వాతే వెల్లడయ్యాయి. ప్రతి ఓటు వివాదస్పదమయ్యే ఉత్కంఠ పరిస్థితులు పటాన్చెరు మండలం పరిధిలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఉంటుంది. నాలుగు టేబుళ్ల వద్ద మాత్రమే ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. మిగతా నాలుగు టేబుళ్లపై జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. తొలుత బాక్స్లను తెరిచి బ్యాలెట్ పత్రాలను వేర్వేరుగా చేసి జెడ్పీటీసీ ఓట్లను ఓ పెద్ద డబ్బాలో వేస్తారు. బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు ప్రారంభిస్తారు. దాదాపు ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఒంటి గంట తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికార వర్గాలు అంచనా. ఒక్కో రౌండు పుర్తయ్యేందుకు కనీసం రెండు గంటల సమయం తీసుకుంటుందని వారు వివరిస్తున్నారు. ఆ లెక్కన ఏడు రౌండ్ల లెక్కింపు జరిగే సరికి 14 గంటల సమయం పడుతుంది.
అంటే రాత్రి ఓంటి గంట వరకు ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి లేదు. ప్రతి రెండు గంటలకోసారి ఎంపీటీసీ ఫలితాలు వెల్లడవుతాయి. తక్కువ ఓట్లు ఉన్న పాటి, ఘనపూర్ వంటి వాటి ఫలితాలు త్వరగానే పూర్తవుతాయి. అయినా అర్థరాత్రి దాటితేనే కాని జెడ్పీటిసీ ఇతర ఎంపీటీసీల ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తి కాదని అనుభవజ్ఙులు పేర్కొంటున్నారు. ఇది కూడా శాంతియుతంగానే కౌంటింగ్ జరిగితేనే సాధ్యపడుతుందని అంచనా. కాని ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తక్కువ ఓట్లతో నెగ్గే పరిస్థితుల్లో రీకౌంటింగ్ వంటివి జరిగితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.
కౌంటింగ్ ఏర్పాట్లు అస్తవ్యస్తం
Published Sun, May 11 2014 11:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement