గాంధీభవన్లో నిరసన మంటలు | congress leaders stage dharna in gandhi bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్లో నిరసన మంటలు

Apr 8 2014 3:42 PM | Updated on Mar 18 2019 8:51 PM

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తుండటంతో గాంధీభవన్లో నిరసన మంటలు చెలరేగుతున్నాయి.

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తుండటంతో గాంధీభవన్లో నిరసన మంటలు చెలరేగుతున్నాయి. టికెట్లు దక్కని పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట టికెట్ తమ నేతకే కేటాయించాలంటూ రాజేందర్ అనుచరులు ధర్నా చేశారు.

అలాగే, నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆకుల లలితకే ఇవ్వాలంటూ ఆమె అనుచరులు కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొల్లాపూర్ టికెట్ను తమ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికే ఇవ్వాలంటూ మహబూబ్నగర్ జిల్లా కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్ గేట్లు తోసుకుని, కార్యాలయ ఆవరణలో బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement