తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలో 73 శాతం పోలింగ్ నమైంది. గురువారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మండుతున్న ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు బారులు తీరారు. తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలో గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.
అయితే మనవాలనగర్ ప్రాం తంలోని పోలింగ్ కేంద్రం, తోయుదావూర్ పోలింగ్ కేంద్రంతోపాటు దాదాపు పది పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభమయ్యూరు. ఈవీఎంలను మొరాయించడంతో ఎన్నికలు ఆల స్యంగా ప్రారంభమయ్యూరు. అయితే వాటిని సరి చేసిన అధికారులు పోలింగ్ ను ప్రారంభించారు.
మొదటి గంట సమయంలో పది శాతం ఓటింగ్ ప్రారంభమైనా, దాదాపు 12 గంటల వరకు 30 శాతం ఓటింగ్ దాటలేదు. అయితే మధ్యాహ్నం తరువాత వేగం పుంజుకుని 6 గంటల వరకు 73 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఓటరు స్లిప్పులు ఉన్నవారినే లోపలికి అనుమతించారు. ఏజెంట్ ల వద్ద నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
సెండ్రాన్ పాళ్యం వద్ద గొడవలు: తిరువళ్లూరు జిల్లాలో అన్నాడీఎంకే, వీసీకే కార్యకర్తలు మధ్య గొడవలు చోటుచేసుకున్నారు. ఓటింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా, వీసీకే నేతలు వాటిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఇదే విధంగా రామంజేరి వద్ద అన్నాడీఎంకే నేతలు, డీఎంకే నేతల మధ్య గొడవ జరిగింది.
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. డీఎంకే పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే రంగనాథన్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఇదే సమయంలో మంజాకుప్పం వద్ద ఓటర్లు తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించని రాజకీయ పార్టీలకు ఓటు వేసేది లేదని తేల్చి చెప్పడంతో అక్కడ సాయంత్రం వరకు కేవలం 20 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద జనం లేక వెలవెలపోయింది. తిరువళ్లూరు పార్లమెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు తప్ప ప్రశాతంగా ముగిసింది.
తిరువళ్లూరులో 73 శాతం ఓటింగ్
Published Fri, Apr 25 2014 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement