'ఎమ్మెల్యేలను కొనడానికే సమయం వెచ్చిస్తున్న బాబు' | ysrcp leaders takes on chandrababu | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేలను కొనడానికే సమయం వెచ్చిస్తున్న బాబు'

Apr 24 2016 11:14 AM | Updated on May 29 2018 2:26 PM

గాలేరు - నగరి కాల్వ పనులకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆరోపించారు.

కడప : గాలేరు - నగరి కాల్వ పనులకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం కడపలో ఆ పార్టీ ఎంపీ పి.మిథున్రెడ్డి, ఎమ్మెల్యే అంజద్బాషా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజాసేవలను విస్మరించారని మిథున్రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కొనడానికి సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీలకు అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్తోనే అని ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement